ఫుట్​బాల్​ విన్నర్​ రంగారెడ్డి

ఫుట్​బాల్​ విన్నర్​ రంగారెడ్డి

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా ఫుట్​ బాల్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో పెబ్బేరు పీజేపీ గ్రౌండ్​లో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి ఫుట్​బాల్​ ఛాంపియన్ షిప్​ ఫైనల్​ పోటీల్లో రంగారెడ్డి జిల్లా జట్టు విజేతగా నిలిచింది. వనపర్తి, ఖమ్మం, మెదక్​, రంగారెడ్డి జట్లు సెమీ ఫైనల్​ కు చేరుకోగా, శుక్రవారం ఉదయం వనపర్తి జట్టుపై ఖమ్మం, మెదక్​ జట్టుపై రంగారెడ్డి విజయం సాధించి ఫైనల్​ కు చేరాయి. ఫైనల్ లో రంగారెడ్డి టీమ్​ 3–-0 స్కోర్​తో ఛాంపియన్​గా నిలిచింది. 

రన్నరప్​ గా ఖమ్మం, మూడో స్థానంలో వనపర్తి, మెదక్​ జట్లు ట్రోఫీలను అందుకున్నాయి. విజేతలకు ట్రోఫీలను అందించి అభినందించారు. అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు​కె కృష్ణకుమార్ రెడ్డి, టీఎఫ్ఏ స్టేట్​ జనరల్​ సెక్రటరీ జీపీ ఫాల్గుణ, మున్సిపల్​ చైర్ పర్సన్​ కరుణశ్రీ, సెలికాన్, ఇరిగేషన్​ ఎస్ఈ సత్య శీలారెడ్డి, తిరుపతి, అప్సర్, రాజేందర్, నాగరాజు, కమల్​ పాల్గొన్నారు.