ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇంటి పై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్కు తగిలి ఓ యువకుడు చనిపోయాడు. కందుకూర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బంజారుగడ్డ తండాలో సోమవారం సాయంత్రం మేఘావత్ చరణ్(17) క్రికెట్ ఆడుకుంటుండగా, బాల్ పక్కనే ఉన్న ఇంటిపై పడింది. బాల్ను తీసుకువచ్చేందుకు వెళ్లి, ఇంటిపై ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్కు తాకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. యువకుడి మృతికి ఇంటి ఓనర్ రమేశ్, విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ రెడ్డి, లైన్మన్ వాసు, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్ నిర్లక్ష్యమే కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
