పుదుచ్చేరిలో తొలిఫలితం..తట్టంచవాడిలో రంగస్వామి గెలుపు

పుదుచ్చేరిలో తొలిఫలితం..తట్టంచవాడిలో రంగస్వామి గెలుపు

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెలువడింది. తట్టంచవాడి నియోజకవర్గం సీఎం అబ్యర్థి, ఏఐఎన్‌ఆర్‌సి అభ్యర్థి ఎన్ రంగస్వామి విజయం సాధించారు. రంగస్వామి 4,441 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రంగస్వామి10,024 ఓట్లు పోలవగా  ఆయన సమీప ప్రత్యర్థి నేయం మక్కల్ కజగంకు చెందిన వినాయగం 5,583 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి కె. సేతుకు 3,984 ఓట్లు లభించాయి.

ఎన్ రంగస్వామి పుదుచ్చేరిలో సీనియర్ నేత. ఆయన మే 2021 నుంచి పుదుచ్చేరి  కేంద్రపాలిత ప్రాంతానికి సీఎంగా ఉన్నారు. రంగస్వామి గతంలో 2001 నుంచి 2008 వరకు , తిరిగి 2011 నుంచి 2016 వరకు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి నుంచి చీలిపోయి 2011లో ఏర్పడిన అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు.