కవిత లెక్కనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ జైలుకెళ్తరు - బీజేపీ నేత రాణి రుద్రమ

కవిత లెక్కనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ జైలుకెళ్తరు - బీజేపీ నేత రాణి రుద్రమ

హైదరాబాద్, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కామ్ ​కేసులో కవిత జైలుకెళ్లినట్టే.. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్, డ్రగ్స్​ దందా, భూకబ్జా కేసుల్లో కేటీఆర్, కాళేశ్వరం అవినీతి కేసులో హరీశ్​రావు జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. రాష్ట్రానికి కిషన్​ రెడ్డి ఏం చేశారని అడుగుతున్న కేటీఆర్.. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ ​విసిరారు. బుధవారం బీజేపీ స్టేట్​ ఆఫీసులో మీడియాతో ఆమె మాట్లాడారు. షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్.. గత ఎన్నికల్లో గెలిచి సీఎం అవుదామనుకున్నారని.. కానీ, ప్రజలు ఓడించడంతో మతిభ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.