బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ (Dhurandhar). ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజై దుమ్మురేపే వసూళ్లు కలెక్ట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్కును దాటి, ధురంధర్ అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ అందుకుంది.
లేటెస్ట్గా ఈ విషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ పోస్ట్ ద్వారా లెక్కలు వెల్లడించారు. ఇండియా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ ఫస్ట్ డే శుక్రవారం రూ. 28.60 కోట్లు, శని రూ. 33.10 కోట్లు, ఆది వారం రూ.44.80 కోట్లు సాధించినట్లు తెలిపారు. ఇలా ధురంధర్ ఫస్ట్ వీకెండ్ మొత్తం రూ.100 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసినట్లు బాక్సాఫీస్ వెల్లడించాడు. రణ్వీర్ కెరీర్లోనే అత్యంత వేగంగా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ నిపుణుల అంచనాలు చెబుతున్నాయి. ఇక ఈ వీకెండ్ ఎండింగ్ వరకు కూడా ఎటువంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
అయితే, అఖండ 2కి ఆర్ధిక సమస్యలు తలెత్తకపోతే.. ఇదే డిసెంబర్ 5న రిలీజై ‘ధురంధర్’కి గట్టి పోటీ ఇచ్చేది. అంతేకాదు.. సినిమా రిలీజ్కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే గట్టి పోటీ ఇచ్చింది అఖండ 2. ఈ క్రమంలో అఖండ 2 రిలీజై ఉంటే ఈ మార్క్ సాధ్యమయ్యేనా? అంటే.. 'సాధ్యమవొచ్చు కానీ, పవర్ తగ్గే ఛాన్స్ ఉండేదని' సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సెన్సార్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లు మాత్రమే చూడాలన్నమాట. ఈ మూవీ అత్యంత భారీ రన్టైమ్తో 3.34 గంటలతో వచ్చిన కూడా ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా చేస్తుందని టాక్ వచ్చింది. 2008లో వచ్చిన ‘జోథా అక్బర్’ నిడివి 3.50 గంటలు కాగా, 17 ఏళ్ల తర్వాత అత్యధిక నిడివితో ఈ సినిమా తెరకెక్కడం విశేషం.
కథ:
1999లో జరిగిన ఐసి–814 విమాన హైజాక్, ఆ తర్వాత 2001లో భారత పార్లమెంట్పై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పాకిస్థాన్ టెర్రరిస్ట్ నెట్వర్క్ను అంతం చేయడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతనే పంజాబ్లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్గా హమ్జా (రణ్వీర్ సింగ్) అనే మారుపేరుతో పాక్లోకి పంపుతాడు.
►ALSO READ | Eesha Trailer: ఊహించని చీకటి ప్రపంచంతో ‘ఈషా’ ట్రైలర్.. ఆత్మలు, మూఢ నమ్మకాలపై హార్రర్ థ్రిల్లర్
అక్కడ అతను ఎలాంటి పోరాటం చేశాడు? ఎదురైన సవాళ్లేంటి? కరాచీ అండర్ వరల్డ్ మాఫియా రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ని ఎలా అంతం చేశాడన్నది మూవీ మెయిన్ కాన్సెప్ట్. దీనికితోడు ఇందులో సంజయ్దత్, అర్జున్ రాంపాల్ పాత్రలు ఏంటనేది సస్పెన్స్. ఇకపోతే.. ఈ మూవీ మేజర్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీ ఇదని ప్రచారం జరగగా, ఇది ఎవరి బయోపిక్ కాదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
దాదాపు ఏడాది విరామం తర్వాత వెండితెరపైకి వచ్చిన రణ్వీర్, ఇందులో మునుపెన్నడూ చూడని క్రూరమైన, తీవ్రమైన అవతార్లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. రణ్వీర్ను గుర్తుపట్టలేనంతటి భయంకరమైన లుక్తో ఆకట్టుకున్నారు. ఆయనలోని అపారమైన శక్తి, తీవ్రత క్షణాల్లోనే ఈ గ్రిట్టీ యాక్షన్ డ్రామాకు టోన్ సెట్ చేశాయి. రణ్వీర్ సింగ్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. దేశంలో అత్యంత శక్తివంతమైన నటులలో ఒకరిగా అతని స్థానాన్ని ఈ మూవీ మరోసారి నిరూపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
