హైదరాబాద్సిటీ, వెలుగు: ఇబ్రహీంపట్నానికి చెందిన 33 ఏండ్ల మహిళ ప్యాంక్రియాస్ ను కాపాడుతూ ట్యూమర్ తొలగించి మలక్పేట కేర్దవాఖాన డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ప్యాంక్రియాస్ చాలా ముఖ్యమైన అవయవం. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసి రక్తంలో షుగర్లెవెల్స్నియంత్రిస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఇబ్రహీంపట్నానికి చెందిన సుష్మితకు ప్యాంక్రియాస్ ట్యూమర్ఏర్పడింది. దీన్ని తీసేస్తే ఆమె జీవితాంతం ఇన్సులిన్పై ఆధారపడాల్సి వస్తుంది. కానీ, అలా జరగకుండా ఏం చేయాలా అని మలక్పేట కేర్డాక్టర్లు ఆలోచించారు.
రోగికి ప్యాంక్రియాస్ చాలా మృదువుగా ఉండటం, ప్యాంక్రియాటిక్ డక్ట్ పరిమాణం 2 మిల్లీమీటర్లు మాత్రమే ఉండడంతో సర్జరీ సవాలుగా మారింది. దీంతో సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ అండ్సర్జికల్ గాస్ట్రోఎంట్రాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ విభాగం హెడ్డాక్టర్ భూపతి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ప్యాంక్రియాస్ తొలగించకుండా రెండు క్లిష్టమైన సర్జరీలు చేసి ఆమె ప్రాణాలు కాపాడారు.
