మాల్స్ లో కొనొద్దంటున్నయాంకర్ రష్మీ

మాల్స్ లో కొనొద్దంటున్నయాంకర్ రష్మీ

అందరూ హ్యాపీగా జరుపుకునే పండుగ దీపావళి. అయితే  ఇలాంటి పండుగలపై ఎంతో మంది ఆధారపడి తమ జీవనాన్ని సాగిస్తుంటారు. వారు తయారు చేసిన బాణాసంచాలు కానీ,  మట్టి దివ్వెలు గానీ అమ్ముకోవడానికి నానా కష్టాలు పడతారు. పండుగకు షాపింగ్ చేయాలంటే చాలా మంది మాల్స్ లో తప్ప బయట రోడ్లపై ,లోకల్ ఎరియాలో తక్కువ ధరకు వస్తూన్నా కొనడానికి ఆసక్తి చూపరు.  అలాంటి వారికి మద్దతుగా తెలుగు యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది.  మట్టి దివ్వెలు చేస్తున్న ఓ ముసలాయన ఫోటో,  ఫుట్ పాత్ పై జూట్ బ్యాగులు అమ్ముతున్న ఓ మహిళ ఫోటోలు షేర్ చేసి ..మాల్స్ లో కాకుండా లోకల్ ఏరియాల్లో షాపింగ్ చేయాలంటూ ట్వీట్ చేసింది.