
డీజీ టిల్లు(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ఈ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్ లో మనోడి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో మేకర్స్ కూడా సిద్దుతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం సిద్దు చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని సమాచారం.
అందులో ఒక సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. సిద్దు నెక్స్ట్ సినిమాల్లో నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika mandana) హీరోయిన్ గా నటిస్తోందట. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక సిద్ధుతో సినిమా చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్(Kona Venkat) సతీమణి నీరజ కోన(Neeraja Kona) కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాను ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అధికారిక ప్రకటన, పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ఈ సినిమా గనుక హిట్ అయితే సిద్దు జొన్నలగడ్డ స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా సిద్ధుకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక ప్రస్తతం సిద్దు డీజీ టిల్లు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వైర్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.