ఓ వైపు సౌత్లో వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బాలీవుడ్లోనూ రాణిస్తోంది రష్మిక మందన్న. అయితే బాలీవుడ్ సినిమాల కోసం ఆమె సౌత్ సినిమాలకు నో చెబుతోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన రష్మిక.. అవన్నీ రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి సైన్ చేసింది రష్మిక. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ మూవీ నుంచి బయటకు వచ్చింది.
మరోవైపు షాహిద్ కపూర్కి జంటగా ఓ హిందీ చిత్రంలో నటించాల్సి ఉండగా.. బడ్జెట్ కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఈ బాలీవుడ్ సినిమా కోసమే రష్మిక.. నితిన్ మూవీ నుంచి తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ఇటీవల సోషల్ మీడియా చాట్లో ఓ ప్రశ్న ఎదురవగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పగలను’ అంటూ ఆ వార్తలను కొట్టిపారేసింది.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్కి జంటగా ‘పుష్ప 2’లో నటిస్తున్న రష్మిక, హిందీలో రణబీర్ కపూర్కి జంటగా ‘యానిమల్’ అనే సినిమా చేస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘రెయిన్ బో’తో పాటు ఇటీవల ధనుష్ మూవీకి కూడా సైన్ చేసింది.