Rashmika Dhanush: మీరిచ్చిన ప్రతిదీ నాకెంతో స్పెషల్.. ధనుష్‌పై రష్మిక ఎమోషనల్‌ నోట్

Rashmika Dhanush: మీరిచ్చిన ప్రతిదీ నాకెంతో స్పెషల్.. ధనుష్‌పై రష్మిక ఎమోషనల్‌ నోట్

ధనుష్, రష్మిక మందన్ననటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘కుబేర’.ఈ మూవీలో వీళ్లిద్దరూ కీ రోల్స్ ప్లే చేసి.. సినిమా సక్సెస్కి కారణమయ్యారు. బిచ్చగాడిగా ధనుష్, సమీరా అనే సగటు యువతిగా రష్మిక.. మంచి సహజ నటనని కనబరిచారు. ఈ క్రమంలో హీరోయిన్ రష్మిక మందన్న హీరో ధనుష్పై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో ధనుష్పై తనకున్న అభిమానాన్ని తన పదాలతో చెప్పుకొచ్చింది. 

రష్మిక ధనుష్తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ‘మీతో కుబేర వంటి పెద్ద సినిమా చేసినప్పటికీ.. మనిద్దరిది ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి.. ప్రతిరోజూ చాలా కష్టపడి పనిచేస్తూ.. సినిమా గురించే ఆలోచిస్తారు. మనం మట్లాడుకున్న ప్రతిసారీ వేర్వేరు నగరాల్లో ఉన్నాం. ఇద్దరం వేర్వేరు పనులు చేసుకుంటూ మాట్లాడుకునేవాళ్లం. ఇందులో భాగంగా విశ్రాంతి ఎంత ముఖ్యమో చర్చించేవాళ్లం. కానీ, విశ్రాంతి మాత్రం తీసుకోలేదు.

కేవలం కుబేర నటనపరంగానే కాదు.. నిజ జీవితంలోనూ మీరు చేసే పనులు ఎంతోమందికి ఆదర్శం. మీరు చేసే ప్రతిసినిమాతో మాకెంతో ప్రేరణ ఇస్తున్నారు. చుట్టూ ఉన్న వారితో ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ముఖ్యంగా మీరు సెట్‌ల్లో నాకోసం తెచ్చిన లడ్డులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.

అలాగే, నాకు తమిళ డైలాగుల్లో మీరు చేసిన సహాయం.. నేను ఏదైనా డైలాగ్ చెప్పినప్పుడు మీరు ప్రశంసించిన తీరు నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కావచ్చు. కానీ, జీవితమంతా గుర్తుంటాయి. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు అందుకోవాలి’అని ధనుష్తో దిగిన సెల్ఫీని రష్మిక షేర్ చేసుకుంది. ఇకపోతే.. కుబేర మూవీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. రూ.100 కోట్ల క్లబ్లో అడుగుపెట్టే దిశగా ఈ మూవీ సాగుతోంది.