టాటా గ్రూప్స్ ఛైర్మన్ రతన్ టాటా తనదైన శైలిలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. జంతువులు అంటే రతన్ టాటాకు అమితమైన జాలి, దయ. ఇటీవలనే టాటా ట్రస్ట్ ఆధ్వరంలో దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక స్మాల్ యానిమల్ హాస్పిటల్ను ప్రారంభించారు.
దాని ద్వారా రోడ్డుపై అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు జంతువులకు ట్రీట్ మెంట్ చేసి, వాటిని పోషణ చూసుకుంటారు. అయితే ముంబైలోని ఓ యానిమల్ హస్పిటల్ లో చేరిన ఓ కుక్క తీవ్ర అనారోగ్యం, రక్తహీనతతో బాధపడుతుందని.. దానికి రక్తం ఎక్కించడానికి బ్లడ్ డొనర్ కావాలని టాటా ఇన్ స్ట్రామ్ లో పోస్ట్ చేశారు. ఎవరైనా పెంపుడు కుక్కలు పెంచుకునే వారు వాళ్ల కుక్కల నుంచి రక్తదానం చేయాలని కోరారు. హాస్పిటల్ లో చేరిన కుక్క గురించి స్వయంగా ఆయనే బ్లడ్ డోనర్ కావాలని పోస్ట్ పెట్టడంతో జంతువులపై ఆయనకున్న ప్రేమ మరొక్కసారి వైరల్ అయ్యింది.
