రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: తెలంగాణలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ కేవైసీ పూర్తి చేసుకోవ చ్చని ప్రకటించింది. 

జనవరి 31తోగడువు ముగియనుండగా.. రేషన్ షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రక్రియ 75.76 శాతం పూర్తయింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ను ఆదేశించారు.