
విజయనగరం: పేసర్ రవితేజ (5/34) ఐదు వికెట్లతో చెలరేగడంతో హైదరాబాద్తో రంజీ ట్రోఫీలో ఆంధ్ర కుప్పకూలింది. మంగళవారం మొదలైన గ్రూప్–బి మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర 51.1 ఓవర్లలో 135 రన్స్ కే ఆలౌటైంది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81) సత్తా చాటినా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.కెప్టెన్ హనుమ విహారి (2), కేఎస్ భరత్ (5), రిక్కీ భుయ్ (6) సహా తొమ్మిది మంది సింగిల్ డిజిట్కే ఔటయ్యారు.
రవితేజకు తోడు కార్తికేయ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ తొలి రోజు చివరకు 30 ఓవర్లలో 79/3 స్కోరు చేసింది. కెప్టెన్ తన్మయ్ (35), ప్రగ్నయ్ (17), రోహిత్ రాయుడు (6) ఔటవగా.. అలంక్రిత్ (10 బ్యాటింగ్), భవేశ్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.