Ravindra Jadeja: ముందే చెప్పాలి కదా: టెస్ట్ కెప్టెన్సీ కావాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన జడేజా

Ravindra Jadeja: ముందే చెప్పాలి కదా: టెస్ట్ కెప్టెన్సీ కావాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన జడేజా

రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్ రేస్ లో గిల్, రాహుల్, బుమ్రా, పంత్ నిలిచారు. ఈ నలుగురిలో గిల్ కే భారత సెలక్టర్లు ఓటేశారు. లెజెండరీ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌‌‌‌‌‌‌‌  తప్పుకున్న తర్వాత  భారీ మార్పులతో టెస్టు జట్టు సరికొత్తగా ముస్తాబైంది. రోహిత్ వారసుడిగా 25 ఏండ్ల శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌ నయా లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు. రిషబ్ పంత్‌కు వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ లభించింది. అయితే ఆశ్చర్యకరంగా జడేజా పేరు ఒక్కరూ కూడా ప్రస్తావించలేదు. టెస్ట్ తుది జట్టులో ఖచ్చితంగా ఉండే జడేజాను ఎవరూ పట్టించుకోలేదు. 

మాజీ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మినహాయిస్తే జడేజాను టెస్ట్ కెప్టెన్ చేయాలని ఒక్కరు కూడా ప్రతిపాదించలేదు. ఇదిలా ఉండగా.. జడేజా తాజాగా టెస్ట్ కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. తనకు భారత టెస్ట్ కెప్టెన్ కావాలనే కోరిక అలాగే ఉండిపోయిందని తన మనసులోని కోరికను వ్యక్తం చేశాడు. 'కుట్టి స్టోరీస్ విత్ యాష్' యూట్యూబ్ షోలో రవీంద్ర జడేజా ఆర్. అశ్విన్‌తో మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ పై కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో జట్టును నడిపించడం టీ20ల కంటే సులభం అని టీమిండియా ఆల్ రౌండర్ ధైర్యంగా చెప్పాడు. 

"టీ20 క్రికెట్ లో ప్రతి బంతి ఒత్తిడిని కలిగిస్తుంది. బౌలర్ కు అనుగుణంగా ఇద్దరో లేదా ముగ్గురు ఫీల్డర్లను మార్చాల్సి వస్తుంది. టెస్టులో మాత్రం కెప్టెన్ ఆలోచించడానికి.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఈ ఫార్మాట్ లో లెఫ్ట్-రిట్ కాంబినేషన్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. పెద్దగా హడావుడి కూడా ఉండదు. నా కెరీర్ లో ఇక మిగిలి ఉన్నది ఒక్కటే. టెస్ట్ కెప్టెన్సీ తప్ప నేను మిగతావన్నీ సాధించాను. టెస్ట్ కెప్టెన్‌గా ఉండటం.. దేశానికి నాయకత్వం వహించడం గర్వకారణం. కెప్టెన్సీ అనేది కాలక్రమేణా నేర్చుకోగల విషయం". అని జడేజా తన మనసులోని మాటలను అశ్విన్ తో షేర్ చేసుకున్నాడు. 

వచ్చే నెల 20 నుంచి ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో జరిగే  ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌‌‌‌‌కు 18 మందితో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది.  మన్సూర్ అలీ ఖాన్ పటౌడి (21), సచిన్ టెండూల్కర్ (23), కపిల్ దేవ్ (24), రవిశాస్త్రి (25) తర్వాత గిల్ ఇండియా యంగెస్ట్‌‌‌‌‌‌‌‌  టెస్ట్  కెప్టెన్ కానున్నాడు. ఇప్పటిదాకా 32 టెస్టులు ఆడిన గిల్ 35 సగటుతో 1893 రనస్ చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు ఫిఫ్టీలు ఉన్నాయి.