నాగ్పుర్ టెస్టులో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. లంచ్ తర్వాత కంగారుల నడ్డి విరిచాడు. తనదైన బంతులతో ఒకే ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న లబుషేన్ (49) స్టంపౌట్ చేశాడు. జడేజా బౌలింగ్ లో లబూషేన్ ముందుకొచ్చి ఆడబోగా... కేఎస్ భరత్ స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే రెన్ షాను డకౌట్ చేశాడు. అయితే ఈ సమయంలో ఆస్ట్రేలియా డీఆర్ఎస్కు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 36 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ (25*), హ్యాండ్స్స్కాబ్ (4) పరుగులతో ఉన్నారు.