బాలీవుడ్, సౌత్ సినిమా ఇండస్ట్రీ మధ్య అడ్డుగోడలు చెరిగిపోతున్నాయి. హిందీ హీరోలు సౌత్లోనూ, మన సౌత్ హీరోలు బాలీవుడ్లోనూ నటిస్తున్నారు. సల్మాన్ కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో వెంకటేష్ కీరోల్ చేస్తున్నారు. అలాగే ‘వార్ 2’లో హృతిక్తో కలిసి ఎన్టీఆర్ నటించబోతున్నాడు. త్వరలో రవితేజ కూడా బాలీవుడ్ సినిమాలో వరుణ్ ధావన్తో కలిసి నటించబోతున్నాడు.
శింబు హీరోగా తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన ‘మానాడు’ సినిమాను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసే ఈ చిత్రంలో రవితేజ, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేయబోతున్నారట. ఈ మూవీతో రవితేజ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హీరో రానాతో కలిసి ఏషియన్ సునీల్ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. వరుణ్ ధావన్ మినహా మిగతా టీమ్ అంతా టాలీవుడ్ వాళ్లే కావడం విశేషం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.