
మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ ఈగల్ (Eagle). ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. మరో రెండ్రోజుల్లో (ఫిబ్రవరి 9న) ఈగల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు.
లేటెస్ట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ చాలా స్టైలీష్ గా ఉంది.మ్యాప్స్ కి..రీసెర్చ్ కి అందని విషయం ఒకటి ఉంటుంది. అక్కడ ఒకడుంటాడు..ఇక్కడ ఇంకోడు ఉంటాడు అని కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన డైలాగ్తో ఈ ట్రైలర్ షురూ అయింది. అక్కడ పదేళ్ల నుంచి ఓ గాడ్జిల్లా ఉండాదిరా అనే డైలాతో పాటు ఓ యుద్ధం..సైన్యమే కాదు..దేశం వచ్చిన ఆపుతాను..అని రవితేజ చెప్పే డైలాగ్ ఆసక్తిగా ఉంది.
ఓ వైపు టెర్రరిస్టులు, మరోవైపు, నక్సలైట్లు, ఇంకోవైపు ఇంటలిజెన్స్ టీం..ఇలా ప్రపంచం అంతా వెతికే ఒక వెపన్లా చూపించారు రవితేజని. ఇలాంటి వాడ్ని చూడాలంటే.. మార్గశిరం మధ్యరాత్రి ఓ మొండి మోతుబరి గురుంచి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఈగల్ రిలీజ్ ట్రైలర్తో ఆకలిమీదున్న రవితేజ ఫ్యాన్స్కి ఆశలు పుట్టించిందనే చెప్పాలి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. మరో బ్యూటీ కావ్య తాపర్(Kavya tapar) కీ రోల్ లో కనిపిస్తోంది. ఈగల్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.