రైతులకు గుడ్ న్యూస్ : పంటలపై వడ్డీలేని అప్పులు రూ.2 లక్షలకు పెంపు

చిన్న, సన్నకారు రైతులకు రుణాల మంజూరు విషయంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎలాంటి హామీ లేకుండా చిన్న, సన్నకారు రైతులకు మంజూరు చేసే రుణాల పరిమితిని లక్షా 66 వేల నుంచి 2 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు.

వ్యవసాయంలో రైతులకు పెట్టుబడులు పెరగడం, రాబడి తగ్గడం.. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి.. ఇలా పలు కారణాల వల్ల రైతులకు ఎలాంటి సెక్యూరిటీ పెట్టకుండా బ్యాంకులు ఇచ్చే పంట రుణాల పరిమితిని పెంచుతున్నామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు.

ALSO READ : 10 నెలల్లోనే 77 టన్నుల బంగారం కొన్న ఆర్బీఐ

ఆర్బీఐ చివరిగా హామీ అక్కర్లేని పంట రుణాల పరిమితిని 2019లో మార్చింది. అప్పటివరకూ లక్ష రూపాయలు ఉన్న పరిమితిని లక్షా 60 వేలకు మార్చింది. ఇప్పుడు ఈ పరిమితిని 2 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లను యథాతథంగా 6.5 శాతంగానే ఉంచింది.