
అప్పులు-వడ్డీలు కట్టడంలో ఒత్తిడి తెలుసుకోవడం కోసమే
కార్పొరేట్ల ఎఫెక్ట్ బ్యాంకులపై పడకుండా ముందు జాగ్రత్తలు
ముంబై : దేశ–విదేశాల నుంచి భారీగా అప్పులు తీసుకున్న 20 పెద్ద బిజినెస్ హౌస్(కార్పొరేట్గ్రూప్)లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జాగ్రత్తగా గమనిస్తోంది. ఏవైనా రిస్క్లు ఎదురయ్యే సూచనలుంటే, ముందుగానే గుర్తించడం కోసమే గతంలో కంటే నిఘాను కొంత పెంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీలు, సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ (సీఆర్ఐఎల్సీ)లను ఆర్బీఐ రొటీన్గానే మానిటర్ చేస్తుంటుంది.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిఘాను మరికొంత పెంచినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా గ్రూప్లు వాటికి సంబంధించిన కంపెనీల లాభదాయకత, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ వంటి అంశాలను ఆర్బీఐ మానిటర్ చేస్తోంది. అంతేకాదు, ఈ గ్రూప్లు అప్పుల రూపంలో ఎంత సేకరించాయి, అందులో ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లేదా బాండ్స్ ఉన్నాయా? అనే దానిని పరిశీలిస్తోంది. అదేవిధంగా, అప్పులు–వాటిపై వడ్డీలను చెల్లించడంలో ఆయా గ్రూప్లు ఏవైనా ఇబ్బందులు పడుతున్నాయా.. అనే అంశాన్ని కూడా గమనిస్తోంది.
ఒత్తిడి ఎదుర్కొంటున్న సూచనలను పసిగట్టేందుకు ఒక మానిటరింగ్ సిస్టమ్ను ఆర్బీఐ ఏర్పాటు చేసుకుంది. పెద్ద కార్పొరేట్ గ్రూప్ల ఇబ్బందుల పర్యవసానంగా బ్యాంకుల బాలెన్స్షీట్లు పాడవకుండా చూడాలనేదే ఆర్బీఐ ప్రయత్నమని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. అప్పులు–వడ్డీలు చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్న సూచనలు కనబడితే పెద్ద ముప్పులు వాటిల్ల కుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలనేదే ఆర్బీఐ ఉద్దేశం.