
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈసారి వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గించొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది. వ్యవస్థలో ఫైనాన్సియల్ కంపెనీలు అప్పులు ఇవ్వడం పెరుగుతుందని, గ్లోబల్ అనిశ్చితులను తట్టుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ జూన్ 4 న ప్రారంభం అవుతుంది. జూన్ 6న పాలసీ వివరాలను ప్రకటిస్తారు. ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్స్ చొప్పున రెపో రేట్ను తగ్గించి, 6 శాతానికి తీసుకొచ్చింది.