రాత్రికి రాత్రే వాగు మాయం: పట్టించుకోని రెవెన్యూ అధికారులు

రాత్రికి రాత్రే వాగు మాయం: పట్టించుకోని రెవెన్యూ అధికారులు

దాదాపు12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వాగు అది. దానిపైనే కొందరు భూ కబ్జాదారుల కన్ను పడింది . ఇంకేముంది రాత్రికి రాత్రే ఆ భూమిలో ఉన్న తాటిచెట్లు, ముళ్ల చెట్లను మెషిన్లతో తొలగించి నేలను నున్నగా చేశారు. సైదాపూర్ మండలంలోని వెనుక పల్లి గ్రామ శివారులో మూలవాగును ఆనుకొని ఉన్న మంగలి దుబ్బ, చీపురు దుబ్బ, ఉడుగుల బొంద దుబ్బ, అనే పేర్లతో పిలువబడే వాగు పన్నెండు ఎకరాలకు పైగా విస్తరించి ఉంది . కొందరు ఆ భూమిని కబ్జా చేసి మంగళవారం రాత్రి జేసీబీ, డోజర్లతో నేలను చదునుచేసి భూమిలో ఉన్న తాటి, వేప, తుమ్మ చెట్లను నరికేశారు. ఇదే నేలను గతంలో కొందరు చదును చేసి సాగు చేయగా, రెవెన్యూ ఆఫీసర్లకు చెబితే పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు.