
న్యూఢిల్లీ: రియల్మీ ఫోన్లు తమ యూజర్ల డేటాను దొంగిలిస్తున్నాయనే ఆరోపణలు పెరిగాయి. ట్విట్టర్ యూజర్ రిషి బాగ్రి పేర్కొన్న దాని ప్రకారం, ఈ ఫోన్లలో ఎన్హాన్స్డ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఫీచర్ ఉంటుంది. ఇది యూజర్ల కాల్స్, ఎస్ఎంఎస్, లొకేషన్ ఇన్ఫర్మేషన్ను సేకరిస్తోంది. రియల్మీ ఫోన్లలో ఈ ఫీచర్ బై డీఫాల్ట్గా ఆన్లో ఉందని రిషిబాగ్రి పేర్కొన్నారు. ఇందుకు ప్రూఫ్గా స్క్రీన్షాట్ షేర్ చేశారు.
సెట్టింగ్స్> అడిషనల్ సెట్టింగ్స్> సిస్టమ్ సర్వీసెస్ లోకి వెళ్లి యూజర్లు చెక్ చేసుకోవచ్చు. మీ ఆరోపణలను చెక్ చేశామని ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రిషి ట్వీట్కు రిప్లై ఇచ్చారు. ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.