తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు

తమిళనాడులో మళ్లీ  భారీ వర్షాలు

బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి, పుదుక్కోట్టై, నాగపట్నం జిల్లాల్లో రెడ్ అలర్ట్ విధించారు అధికారులు. మధురై నగరంలో కురిసిన కుండపోత వానకు ఇళ్లలోకి నీరు చేరాయి. వరద నీరు వచ్చి చేరడంతో  ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేపు(శనివారం) 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. తమిళనాడులో మరో 5 రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది.

భారీ వర్షాలు కురుస్తుండటంతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెన్నైలో 91 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.