ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త ప్రకటించింది. విజయవాడలో త్వరలో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రీజనల్ పాస్ ఫోర్ట్ ఆఫీసర్ శివ హర్ష అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రానికి అదనంగా విజయవాడ బందర్ రోడ్డులో రీజనల్ పాస్ పోర్ట్ కార్యాలయం ప్రారంభించనున్నారు.
రీజనల్ పాస్ పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 2వేల అప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయని రీజనల్ పాస్ ఫోర్ట్ ఆఫీసర్ శివ హర్ష వివరించారు. అక్టోబర్ నెల వరకు 3లక్షలు పాస్ పోర్టులు జారీ చేశామని వెల్లడించారు. పోస్టల్, పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్ పోర్టులు త్వరితగతిన అందజేస్తున్నామని తెలిపారు. విజయవాడ రీజనల్ ఆఫీస్ కేంద్రంగానే పాస్ పోర్టు ప్రింటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు శివహర్ష. విజయవాడలో ఆఫీస్ ప్రారంభం కావడం వల్ల త్వరగా సేవలు అందుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో రీజనల్ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభం కానుంది.. గతం కంటే ప్రస్తుతం పాస్ పోర్టు సేవలు సులభతరం చేశామన్నారు. తక్కువ సమయంలోనే పాస్ పోర్టులు అందజేస్తున్నామని.. దయచేసి ఎవరూ ఫేక్ సైట్లు,బ్రోకర్లను నమ్మొద్దని కోరారు.
- ALSO READ | గుండె తరలింపునకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫ్లయిట్