కుక్కర్లు పంచిండని కేసు .. కంది శ్రీనివాస్​ రెడ్డిపై ఈసీ ఆదేశాలతో నమోదు

కుక్కర్లు పంచిండని కేసు ..  కంది శ్రీనివాస్​ రెడ్డిపై ఈసీ ఆదేశాలతో నమోదు

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్​ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్​ఆశిస్తున్న కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదైంది. రాబోయే ఎన్నికల్లో తనకు ఓటువేసి గెలిపించాలని శుక్రవారం రాత్రి ఆయన మహిళలకు కుక్కర్లు పంపిణీ చేస్తుండగా ఓ వ్యక్తి ఎలక్షన్​కమిషన్​కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎలక్షన్​ కమిషన్ ఆదేశాలతో పోలీసులు స్పాట్​కు చేరుకొని శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేసి కుక్కర్లను సీజ్ చేశారు. అలాగే, అతనిపై 171ఈ, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.