వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) దరఖాస్తుల నమోదు ప్రక్రియ డిసెంబరు 2న ప్రారంభం కానుంది. నీట్ను దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 3న జాతీయ పరీక్షా సంస్థ (NTA) నిర్వహించనుంది. విదేశాల్లో మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులు కూడా నీట్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సిఉంటుంది.