కాంట్రాక్టు లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

కాంట్రాక్టు లెక్చరర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్
  • సీఎంవో నుంచి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంట్రాక్టు లెక్చరర్లను త్వరలో రెగ్యులరైజ్​చేయనున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అర్హత గల కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించాలని ఆదేశించినట్లు సమాచారం.

కాంట్రాక్టు ఎంప్లాయీస్​ రెగ్యులరైజేషన్​పై 2016 ఫిబ్రవరి 26న ప్రభుత్వం జీవోను జారీ చేసింది. దీనిపై మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అభ్యర్ధి ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అనుకూలంగా ఈ ఏడాది సెప్టెంబర్ 20న తీర్పును వెలువరించింది. దీంతో కాంట్రాక్టు లెక్చరర్ల పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగినట్లయింది.