ఆన్లైన్ షాపింగ్ మార్కెట్లో ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్లహవా నడుస్తోంది. వీటితో ఢీకొట్టడానికి రిలయన్స్, టాటాలు భారీగా పెట్టుబడులను గుమ్మరిస్తున్నాయి. దీనివల్ల ఆన్లైన్ మార్కెట్లో చివరికి ఈ నాలుగు కంపెనీలే మిగులుతా యని స్టడీ రిపోర్టులు చెబుతున్నా యి. ఫ్లిప్కార్ట్, రిలయన్స్, అమెజాన్, టాటా (ఫ్రాట్)లు ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో 80 శాతానికిపైగా వాటా దక్కించుకోగలుగుతాయని ఫారెస్టర్ రిపోర్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లే! ఇవి జనంలోకి అంతగా చొచ్చుకుపోయాయి. ఈ రెండింటికీ తమ పేరెంట్ అమెరికన్ కంపెనీల నుంచి భారీగా డబ్బులు వస్తుంటాయి. ఫండింగ్ కారణంగా భారీగా డిస్కౌంట్లు ఇస్తూ దూసుకెళ్తున్నాయి. వీటిని బలంగా ఢీకొట్టడానికి మన దేశంలోని బడా కార్పొరేట్ గ్రూపులు టాటా, రిలయన్స్ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ల మాదిరే ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ ఆన్లైన్ రిటైలింగ్ మార్కెట్లో చివరికి ఈ నాలుగే మిగులుతాయని, మిగతావి నామ్ కే వాస్తేగా నడుస్తాయని రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ ఫారెస్టర్ రిపోర్టు వెల్లడించింది. దీనిప్రకారం ఫ్లిప్కార్ట్, రిలయన్స్, అమెజాన్, టాటా (ఫ్రాట్)లు ఆన్లైన్ రిటైల్ మార్కెట్లో 80 శాతానికిపైగా వాటా దక్కించుకోగలుగుతాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పోటీ పడేందుకు టాటా ‘న్యూ’ పేరుతో సూపర్యాప్ను తయారు చేసింది. అంతేకాదు ఫార్మా స్టార్టప్1ఎంజీని, గ్రాసరీ స్టార్టప్ బిగ్బాస్కెట్ను కొన్నది. సూపర్ యాప్తో టాటా గ్రూపు సంస్థల సేవలను, ప్రొడక్టులను ఆర్డర్ చేయవచ్చు. ఆన్లైన్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్ను తెచ్చే ప్రయత్నాల్లోనూ ఈ గ్రూప్ ఉంది. టాటా డిజిటల్ను విస్తరించడానికి దండిగా నిధులు ఇవ్వాలని పేరెంట్ కంపెనీ టాటా సన్స్ను కోరింది. జియోమార్ట్ పేరుతో రిలయన్స్ ఆన్లైన్ గ్రాసరీ వెర్టికల్ను మొదలుపెట్టి చాలా తక్కువ ధరలకు వస్తువులను అమ్ముతోంది. క్విక్ డెలివరీ స్టార్టప్ డంజోలోనూ ఇన్వెస్ట్ చేసింది.
ఆకాశమే హద్దు..
ఆన్లైన్ రిటైలింగ్ సెక్టార్ ఏటేటా దూసుకెళ్తూనే ఉంది. అమెరికా, చైనా తరువాత ఆన్లైన్ షాపింగ్ సెక్టార్ను ఎక్కువగా డెవెలప్ చేయగల సత్తా ఇండియాకే ఉందని ఫారెస్టర్ రిపోర్టు ప్రకటించింది. ఆన్లైన్ రిటైల్లో 2020, 2021 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లు ఎనిమిది బిలియన్ డాలర్లు (దాదాపు రూ.61 వేల కోట్లు) ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ, సాధారణ రిటైల్ అమ్మకాలు తగ్గినా ఆన్లైన్ రిటైల్ సేల్స్విలువ అదనంగా 1.6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 వేల కోట్లు) పెరిగింది. మొత్తం 41 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.మూడు లక్షల కోట్లు) విలువైన వస్తువులు అమ్ముడయ్యాయి. 2025 నాటికి ఈ మార్కెట్ సైజు 85 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.6.47 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా. భారతదేశంలో ఆన్లైన్ షాపర్ల సంఖ్య 2016లో 7.15 కోట్లు నుండి 2020లో 17.95 కోట్లకు పెరిగింది. 2025 నాటికి ఈ సంఖ్య 29.15 కోట్లకు పెరుగుతుందని ఫారెస్టర్ అంచనా వేసింది. ఈ గ్రోత్కు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల జనాలు
కారణం. సెప్టెంబర్ 2021 నాటికి, గ్రామీణ భారతదేశంలో 33.6 కోట్ల మంది ఇంటర్నెట్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఈ సంఖ్య 2020 కంటే 11.3శాతం పెరిగింది.
2020 –- 25 మధ్య మొత్తం ఆన్లైన్ కొనుగోలుదారుల సంఖ్య 10.1 శాతం సీఏజీఆర్తో పెరగనుంది. లాక్డౌన్ల సమయంలో జనం ఇండ్లకే పరిమితం కావడంతో ఆన్లైన్ షాపింగ్కు బాగా అలవాటయ్యారని ఫారెస్టర్ వైస్–ప్రెసిడెంట్, రీసెర్చ్ డైరెక్టర్ అశుతోష్ శర్మ అన్నారు. కోవిడ్కు ముందు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీల్లో అమ్మకాలు ఎక్కువ ఉండేవి. కరోనా తరువాత కిరాణా సామాగ్రి, పర్సనల్ కేర్ప్రొడక్టులను కూడా ఆన్లైన్లోనే కొనడం ఎక్కువయింది.