జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీసు రెన్యువల్

జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీసు రెన్యువల్

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ సేవలపై ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని మౌళిక వసతులు, అవసరాల మేరకు 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను రెనివల్ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ప్రభుత్వం 2022  -  23 విద్యా సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీల సేవలను రెన్యువల్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. పార్ట్ టైం బేసిస్ మీద గెస్ట్ ఫ్యాకల్టీ సేవలను ఈ ఏడాది కొత్త అగ్రిమెంట్ తీసుకుని సేవలను రెన్యువల్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.