న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఈసారి నుంచి జనవరి 23 నుంచే మొదలవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏటా జనవరి 24 నుంచి రిపబ్లిక్ డే సంబరాలు మొదలవుతాయి. అయితే ఈసారి నుంచి ఒకరోజు ముందుగా అంటే జనవరి 23 నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఇక నుంచి ఆయన గౌరవార్థం ప్రతి ఏటా జనవరి 23 నుంచి రిపబ్లిక్ డే సంబరాలు ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ కుటుంబ సభ్యులు స్వాగతించారు.