
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుధవారం మద్దతు తెలిపింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆ పార్టీ నేతలతో కలిసి గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజలు నిశ్చయిం చుకున్నారని తెలిపారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలని చెప్పారు. ఈశ్వరీ బాయీ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా.. కాంగ్రెస్కు మద్దతు తెలపడం శుభ పరిణామమని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం రాష్ట్ర,దేశ రాజకీయాలకు ఎంతో అవసరమన్నారు. కాంగ్రెస్కు తమ పార్టీ బేషరతుగా మద్దతు తెలుపుతున్నదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత మహేశ్ బాబు తెలిపారు. ఈ పార్టీని బాబా సాహెబ్ అంబేద్కర్ స్థాపించగా.. తెలుగు రాష్ట్రాలకు ఈశ్వరీ బాయీ తీసుకొచ్చారన్నారు. ఆమె ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశారన్నారు. కాగా, కాంగ్రెస్కు మద్దతు తెలపడంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్ర కమ్యూనికేషన్స్ ఇన్చార్జి అజయ్ కుమార్ ఘోష్ కృతజ్ఞతలు తెలిపారు.