జమ్ముకశ్మీర్ లో కూలిన టన్నెల్

జమ్ముకశ్మీర్ లో కూలిన టన్నెల్

జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కుప్పకూలింది. రాంబన్ జిల్లాలోని ఖూనీ నాలా దగ్గర జమ్ము- శ్రీనగర్ హైవేపై నిర్మిస్తున్న సొరంగ మార్గంలోని కొంత భాగం గురువారం రాత్రి కుప్పకూలింది. టన్నెల్ లో ఏడుగురి చిక్కుకున్నట్లు తెలిపారు అధికారులు. గల్లంతైన వారిని రక్షించడానికి పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు టన్నెల్ నుంచి ఒకరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు రాంబన్ డిప్యూటీ కమిషనర్. మిగిలిన ఆరుగురిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ కూలిపోవడంతో.. టన్నెల్ ఏరియాలో రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

ప్రాంతీయం కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోన్న ఓటీటీ

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు స్వల్ప ఉద్రిక్తత