పారా స్పోర్ట్స్‌‌ ప్లేయర్లకూ 2 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: హైకోర్టు

పారా స్పోర్ట్స్‌‌ ప్లేయర్లకూ 2 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పారా స్పోర్ట్స్‌  క్రీడాకారులకు అన్ని రకాల ప్రభుత్వ నియామకాలు, సీట్ల భర్తీలో 2 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం 2012లో జారీ చేసిన జీవో 74లో స్పోర్ట్స్‌‌ కోటాను మాత్రమే పేర్కొందని, పారా స్పోర్ట్స్‌‌ క్రీడాకారులను కూడా అందులో చేర్చా లని, జూనియర్‌‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన రాగుల నరేశ్  యాదవ్‌‌ పిల్ వేశారు. 

దీనిపై చీఫ్‌‌  జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌  తుకారాంజీల డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల విచారించింది.