
మహ్మద్ నగర్ (ఎల్లారెడ్డి), వెలుగు : మండల కేంద్రంలోని బుడగ జంగాల కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా కావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బోధన్, హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో వాహనాలు నిలిచి ట్రాఫిక్ జామ్ కావడంతో ఎస్సై శివకుమార్ అక్కడికి చేరుకొని మహిళలను సముదాయించారు. పంచాయతీ అధికారులతో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసనవిరమించారు.