మెదక్​ జిల్లాలో కాంగ్రెస్​కు మండల పార్టీ అధ్యక్షుల రాజీనామా

మెదక్​ జిల్లాలో కాంగ్రెస్​కు మండల పార్టీ అధ్యక్షుల రాజీనామా

రామాయంపేట/ నిజాంపేట, వెలుగు : మెదక్​ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి  మంగళవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఇరు మండలాల అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, లింగం గౌడ్ తో పాటు పలువురు నాయకులు రామాయంపేటలో సమావేశమై తమ నిర్ణయాన్ని ప్రకటించారు. వారు మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన డీసీసీ ప్రెసిడెంట్​కంఠారెడ్డి తిరుపతి రెడ్డికి మద్దతుగా తాము కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పదేండ్లుగా పార్టీ అభివృద్ధి కోసం తిరుపతి రెడ్డి కృషి చేశారని

ఇప్పుడు అతడిని కాదని మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈ  నిర్ణయంపై పార్టీ హైకమాండ్​ పునరాలోచించుకోవాలని కోరారు. రాజీనామా చేసిన వారిలో బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవులు, కిసాన్ సెల్ మండల ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, ఎస్టీ సెల్ నాయకుడు తౌర్యా నాయక్, మధుసూదన్ రెడ్డి, మైనార్టీ సెల్ అలీ తదితరులు ఉన్నారు.