పర్యావరణాన్ని కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

పర్యావరణాన్ని కాపాడడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కిషన్ రెడ్డి

పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. అంతకుముందు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి.. వాతావరణ కాలుష్యాన్ని నిరోధించాలని కోరారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం సైతం పర్యావరణ రక్షణ కోసం కఠిన చట్టాలు చేసిందని తెలిపారు.