గుట్టలో తీర్థ ప్రసాద వితరణ పునః ప్రారంభం

గుట్టలో తీర్థ ప్రసాద వితరణ పునః ప్రారంభం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి ధర్మదర్శనానికి 2 గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంటకు పైగా టైం పడుతోంది. యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలను ఆలయ ఈవో గీతారెడ్డితో కలిసి ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని సూచించారు. కరోనా కారణంగా యాదగిరిగుట్ట  లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2020 మార్చి 23 నుంచి నిలిపివేసిన తీర్థ ప్రసాద వితరణను శనివారం ఆలయ ఆఫీసర్లు పునరుద్ధరించారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఒక్కరోజే ఆలయానికి రూ.23,37,923 ఆదాయం వచ్చింది.