ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

 సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నారు.  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. రాహుల్ గాంధీ చేపటనున్న భారత్ న్యాయ యాత్ర పై లోక్ సభ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలన్నదాని పై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, హాజరుకానున్నారు.

 లోక్ సభ ఎన్నికల్లో పొత్తులు, పై ఎత్తుల విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. దీంతో పాటు తెలంగాణలో ఖాళీగా ఉన్న నామినేటడ్ పోస్టుల విషయంలో పార్టీ పెద్దల అంగీకారం తీసుకోనున్నట్టు తెలుస్తుంది.