సీఎంగా రెండేండ్లు పూర్తి..గాంధీ భవన్లో సెలబ్రేషన్స్

సీఎంగా రెండేండ్లు పూర్తి..గాంధీ భవన్లో సెలబ్రేషన్స్

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం గాంధీ భవన్​లో ఫిషరీస్  చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్  కార్యకర్తలు పటాకులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాయికుమార్​ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.