కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తున్నం: రేవంత్

కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తున్నం: రేవంత్

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఏం చేసిందో   వరంగల్ ఏకశీల పార్కు వద్ద చర్చకు రావాలన్నారు. చర్చలో తాను చెప్పేవి అబద్ధాలైతే ముక్కు నేలకు రాస్తా..  ఒక వేళ  మీరు  చెప్పివి అబద్ధాలైతే ప్రజలకు క్షమాపణ చెబుతారా అంటూ కేటీఆర్ కు   సవాల్ చేశారు.  నాగార్జున సాగర్, శ్రీశైలం, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా.. ప్రతీ ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ కట్టినవేనన్నారు.  సిద్దిపేట చింతమడకలో గుడి, బడి నీళ్ల ట్యాంక్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు.  హైటెక్ సిటీ, శిల్పారామం, మెట్రో రైల్, దేశంలో రైల్వే స్టేషన్లు కూడా కాంగ్రెస్ కట్టినవేనన్నారు. 

పరాకాలలో ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి దోపీడీల గురించి అందరికీ తెలుసని రేవంత్ అన్నారు.  పరకాలలో మొత్తం కాంట్రాక్టులు ధర్మారెడ్డివేనని ఆరోపించారు. ఈ పోరాటాల గడ్డపై దళారులు, దండుపాళ్యం ముఠా కట్టి దోచుకుంటున్నాయని విమర్శించారు

నిజంగా తెలంగాణ ప్రజలు మీ కుటుంబం అయితే వైద్య విద్యార్థి ప్రీతి కుటుంబాన్ని  ఎందుకు పరామర్శించలేదని కేటీఆర్ ను ప్రశ్నించారు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇలానే చేస్తారా అని  నిలదీశారు. పరకాల సాక్షిగా తెలంగాణ కుటుంబం నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తున్నామని రేవంత్ అన్నారు.