పార్లమెంట్ లో టీఆర్ఎస్ వి ఉత్తుత్తి నిరసనలు

పార్లమెంట్ లో టీఆర్ఎస్ వి ఉత్తుత్తి నిరసనలు

పార్లమెంట్ లో నిరసన పేరుతో TRS ఎంపీలు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. FCI సేకరించిన బియ్యం ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయం అయ్యాయన్నారు రేవంత్. వరంగల్ లో మాయమైన 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఘటనపై కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదో చెప్పాలన్నారు. కేసీఆర్ ఆడుతున్న నాటకంతో రైతుల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. కావాలనే వడ్ల కొనుగోలు ప్రక్రియను 60 రోజులు ఆలస్యం చేశారని విమర్శించారు రేవంత్.కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎందుకు నిరసన తెలపరన్నారు.

https://www.youtube.com/watch?v=ROE6Ftzqcvo