కేసీఆర్ వెళ్లకుండా దొంగ సంతకాలు చేయించిండు

కేసీఆర్ వెళ్లకుండా దొంగ సంతకాలు చేయించిండు

బండి, కారు ఒక్కటేనని…కేసీఆర్ ను సంజయ్ ను వేరు వేరుగా చూడలేమన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిచండంపై కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకునే దమ్ము బీజేపీకి ఉందా అని బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ కు కేసిఆర్ హాజరు కాకుండా ..హాజరు పట్టికలో కేసీఆర్ కు బదులు మరోకరితో సంతకాలు చేయించాడన్నారు.  కేసీఆర్ పార్లమెంట్ కు ఎన్నిసార్లు హాజరయ్యారో..సంతకాలు ఏవరివో.. బండి సంజయ్ ఫోరెన్సిక్ టెస్ట్ చేపించగలడా అని ప్రశ్నించారు. కేసీఆర్ చదువుకుంది బీఏ… కానీ ఎంఏ చదువుకున్నట్లు పార్లమెంట్ కు సమాచారం ఇచ్చాడన్నారు.

శ్రవణ్ వెనక ఎవరు లేరని కొందరు దున్నపోతులు విర్రవీగితే ఊరుకునేది లేదన్నారు. దాసోజుపై తలసాని ఇష్టానుసారం మాట్లాడితే ఈపులు విమానం మోత మోగుతాయన్నారు. కేటీఆర్ సమాధానం చెప్పలేక పారిపోయి అచ్చోసు ఆంబోతులను శ్రవణ్ పై వదిలాడన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు చిన్నారెడ్డి విద్యావేత్త ,రాములు నాయక్ సామాజిక వేత్తలన్నారు.