RGV లేటెస్ట్ ట్వీట్.. వ్యూహం విజయవాడలో.. ఎందుకో తెలుసా?

RGV లేటెస్ట్ ట్వీట్.. వ్యూహం విజయవాడలో.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కిస్తున్న మూవీ వ్యూహం(Vyuham).  అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ నుండి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు వర్మ. వ్యూహం షూటింగ్ విజ‌య‌వాడ‌లో ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

వర్మ ట్వీట్ చేస్తూ..ఈరోజు విజయవాడలో నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో వ్యుహం చిత్రం కోసం ప్రేక్షకుల సన్నివేశాన్ని చిత్రీకరించడం చాలా ఆనందంగా ఉంది.. పాల్గొనేవారిని ఆహ్వానిస్తున్నాము..అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ షూటింగ్ అప్డేట్ షేర్ చేస్తున్నందుకు..తానెంతో థ్రిల్ అవుతున్న‌ట్లు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు ఫొటోస్ పోస్టర్ లో షేర్ చేయటంతో..షూటింగ్ పై క్యూరియాసిటీని పెంచేశారు. 

ఈ ట్వీట్ తో మరోసారి వర్మ.. రాజకీయాల్లో, ప్రేక్షకుల్లో హాట్ సబ్జెక్టు అయ్యారు. వ్యూహం మూవీ  వెనుక ఎలాంటి స్ట్రాట‌జీ ఉందో తెలుసుకోవాలని అందరు వెయిట్ చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి  రాజకీయ కోణంలో క‌థ‌ సాగుతుంద‌ని తెలిసిందే. కానీ, లేటెస్ట్ ట్వీట్ తో విజయవాడ లో ఏం జరగబోతుంది..కేవలం విజయవాడ లోకల్ వాళ్ళనే షూట్ కు పిలవడంతో..చర్చనీయాంశమైంది. ఇక ఈ మూవీలో ఇప్పటికే రిలీజ్ చేసిన జగన్ పాత్ర, వైఎస్ భారతి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాత్రలు పరిచయం చేశారు.

వ్యూహం మూవీలో జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి పాత్ర లో మానస రాధాకృష్ణన్   నటిస్తుంది.  అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం.. ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.