న్యూయార్క్‌లో యువ సీఈవో దారుణ హత్య

న్యూయార్క్‌లో యువ సీఈవో దారుణ హత్య
  • ముక్కలు ముక్కలు చేసిన దుండగులు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ట్రాన్స్‌పోర్ట్‌, ఫుడ్‌ డెలివరీ సేవలు అందించే సంస్థ సీఈవో ఫాహిమ్‌ సలేహ్‌ హత్యకు గురయ్యారు. తన ఫ్లాట్‌లోనే గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని చంపేసి.. శవాన్ని ముక్కలు ముక్కలు చేశారు. ఫాహిమ్‌ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త. ఆయన సోదరి ఫ్లాట్‌కు వచ్చేసరికి దుండగులు ఫాహిమ్‌ శవాన్ని ముక్కలు చేసి పడేశారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఎవరో ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌ ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. సోదరి రావడాన్ని గమనించిన దుండగులు ఫ్లాట్‌ నుంచి పారిపోయారని చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఫాహిం న్యూయార్క్‌లో పెరిగాడు. 33 ఏళ్లకే పథావ్‌ పేరుతో బంగ్లాదేశ్‌లో ట్రాన్స్‌పోర్ట్‌, రవాణా, ఫుడ్‌ డెలివరీ రంగాల్లో సేవలు అందించే సంస్థలను స్టార్ట్ చేశారు. మార్కెట్‌లో దీని విలువ 100 మిలియన్‌ డాలర్లుగా ఉంది. నైజీరియాలో కూడా సంస్థలు స్థాపించాడు. ఇది ట్యాక్సీ సర్వీసులు, డెలివరీ సేవలను అందిస్తోంది.

CEO, Ride-Hailing, New York, Murder