
తిరుమల శ్రీవారిని నేడు (జూన్ 16న) మాజీమంత్రి ఆర్కే రోజా, సినీనటి మీనా, మరియు నటి ఇంద్రజ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం తెల్లవారు జామున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ ముగ్గురు హీరోయిన్స్ 1990-2000 కాలంలో వరుస సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
వీటిలో చిరంజీవి 'ముఠామేస్త్రీ', బాలకృష్ణ హీరోగా వచ్చిన 'బొబ్బిలి సింహం' చిత్రాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వీరు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. బయట కూడా మంచి స్నేహితులు. తరుచుగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో, గెట్ టు గెదర్ మీటింగ్స్ లో కూడా కలుస్తుంటారు. ప్రస్తుతం ఈ అలనాటి హీరోయిన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.