గచ్చిబౌలి IIIT జంక్షన్‎లో రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

గచ్చిబౌలి IIIT జంక్షన్‎లో రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

హైదరాబాద్: గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలి IIIT జంక్షన్‎లో బైకును వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఓ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

మరో యువకుడికి ఎటువంటి ప్రాణపాయం లేదని డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన యువకుడిని దుర్గ కిరణ్ (25)గా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన గచ్చిబౌలి పోలీసులు.. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా గుర్తించి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.