లారీ – ఆటో ఢీ: ముగ్గురు మృతి

లారీ – ఆటో ఢీ: ముగ్గురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా… నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. మాచవరం, పేరూర్ శివారులో ఆటోను లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పాపన్నపేటకు చెందిన భూదమ్మ, భూలక్ష్మీ, అనసూయ అక్కడికక్కడే చనిపోయారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. సీరియస్ గా ఉన్న నలుగుర్ని ట్రీట్ మెంట్ కోసం గాంధీకి తీసుకొచ్చారు.