చెల్లికి బిర్యానీ తెస్తుండగా..యాక్సిడెంట్ లో యువకుడు మృతి.. శంషాబాద్ మండలంలో ఘటన

చెల్లికి బిర్యానీ తెస్తుండగా..యాక్సిడెంట్ లో యువకుడు మృతి.. శంషాబాద్ మండలంలో ఘటన

శంషాబాద్, వెలుగు: చెల్లికి బిర్యానీ తీసుకురావడానికి వెళ్లిన ఓ అన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషాద ఘటన శంషాబాద్ మండలంలో జరిగింది. శంషాబాద్ రూరల్ ఇన్​స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన నీరటి అభిలాశ్(19) బుధవారం రాత్రి 9 గంటలకు చెల్లికి బిర్యానీ తీసుకొస్తానని చెప్పి బైక్​పై కవేలీగూడకు వెళ్లాడు. బిర్యానీ తీసుకొని తిరిగి వస్తుండగా మల్కారం గ్రామ పరిధిలోని కేబీఆర్ ఫామ్ వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయమై స్పాట్​లో చనిపోయాడు. డీసీఎం ఎలాంటి సిగ్నల్​ వేయకుండా రోడ్డుపై నిలిపినందునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.