
జగిత్యాల టౌన్, వెలుగు: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాలలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ‘పోలీస్ పాఠశాల–యువ పౌరుల కోసం రోడ్డు భద్రత’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ అవగాహన కల్పించి వారిని ట్రాఫిక్ వారియర్స్ గా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేటి నుంచి ప్రతి వారం జిల్లాలోని ఒక్కో స్కూల్ కు వెళ్లి పోలీసులు విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ కరుణాకర్, ఐటీ కోర్ ఇన్ స్పెక్టర్ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, టీచర్లు పాల్గొన్నారు.