గండిపేట, వెలుగు: పెళ్లి చూపుల కోసం ఊరెళ్లి వచ్చేసరికి రాజేంద్రనగర్ పీఎస్పరిధిలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం సిరిమల్లేనగర్ కాలనీలో ఉండే తేజేశ్వర్రెడ్డి సాఫ్ట్వేర్ఇంజనీర్. ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన తేజేశ్వర్ పెళ్లి చూపుల కోసం ఈ నెల 9న కుటుంబతో కలిసి సొంతూరు వెళ్లాడు. వారం రోజులు అక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి మెయిన్డోర్ తెరిచి ఉంది. లోనికి వెళ్లి చూడగా అల్మారా, కబోర్డులు అన్ని తెరిచి ఉన్నాయి. అల్మారాలోని వస్తువులన్నీ చిందర వందరగా బెడ్పై పడేసి ఉన్నాయి. అందులో దాచిన 3 తులాల బంగారు ఆభరణాలు, కిలోన్నర వెండి ఆభరణాలు, ల్యాప్టాప్, రూ.50 వేలు క్యాష్కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన తేజేశ్వర్వెంటనే రాజేంద్రనగర్పీఎస్లో కంప్లైంట్చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.